ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది

By -  Knakam Karthik
Published on : 29 March 2026 2:17 PM IST

AndhraPradesh, AP News, IAS Transfers, AP Govt, Administrative Shuffle

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న షణ్మోహన్‌ను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) సీఈవోగా బాధ్యతలు అప్పగించగా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌ను ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.

జిల్లాల పాలనలో వేగం పెంచేలా పలు కొత్త నియామకాలను చేపట్టిన ప్రభుత్వం, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా టి. నిశాంతిని, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్‌ను నియమించింది. అలాగే గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బాధ్యతలు చేపట్టనుండగా, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా హరేంద్రప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్‌గా తమిమిన్ అన్సారియాను నియమించడంతో పాటు, బదిలీ అయిన అధికారులను వెంటనే తమ కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల అమలు మరియు జిల్లాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు తెలుస్తోంది.

Next Story