రైతుల అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయకపోతే వెంటనే చేసేయండి

రాష్ట్రంలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌' పథకాన్ని ఈ నెల 20వ తేదీన అమలు చేస్తారని తెలుస్తోంది.

By అంజి
Published on : 9 Jun 2025 6:47 AM IST

AP government, Annadatha Sukhibhav, PM Kisan scheme, farmers

రైతుల అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయకపోతే వెంటనే చేసేయండి

అమరావతి: రాష్ట్రంలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌' పథకాన్ని ఈ నెల 20వ తేదీన అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోనే నిధులు జమ అవుతాయని సమాచారం. ఈ కేవైసీ చేసుకోని వారు వెంటనే చేసుకోవాలి. https://pmkisan.gov.in/లో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి. పీఎం కిసాన్‌ రూ.2 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.5 వేలు అందిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా రైతుల అకౌంట్లలో రూ.6వేలు జమ చేస్తోంది. ఇలా కేంద్రం జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో రూ.2వేల చొప్పున.. పెట్టుబడి కోసం ఏడాదిలో రూ.6000 ఇస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కోసం రూ.14,000 ఇస్తామని చెప్పింది. దీన్ని కూడా 3 విడతలుగా ఇస్తారని తెలుస్తోంది. అంటే జూన్‌ 20న రూ.5,000, అలాగే.. అక్టోబర్‌లో మరో రూ.5,000 ఇంకా ఫిబ్రవరిలో మరో రూ.4,000 జమ చేయనుందని, ఇలా మొత్తం రూ.14,000 జమ చేస్తుందని సమాచారం. 45 లక్షల 71 వేల మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Next Story