నెలకు రూ.11,500.. వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

By అంజి
Published on : 25 Jun 2025 7:51 AM IST

AP government, Anganwadi workers, APnews

నెలకు రూ.11,500.. వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాజా కేబినెట్‌ భేటీలో మినీ అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయనుంది. దీంతో 6497 మినీ అంగన్‌వాడీలు.. ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ కానున్నాయి. దీని ద్వారా అందులో పని చేస్తున్న 4,687 మందిని ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తలుగా గుర్తించి నెలకు రూ.11,500 చొప్పున గౌరవ వేతనం అందించనుంది. ప్రస్తుతం వారికి రూ.7000 వేతనం అందుతోంది.

కొత్తగా 4,687 మంది సహాయకులను నెలకు రూ.7,000 జీతం చెల్లించి నియమించనుంది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.64.67 కోట్లు ఖర్చు కానుంది. ఇదిలా ఉంటే.. నిన్న ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం, ధవళేశ్వరం మరమ్మతులకు రూ.350 కోట్ల కేటాయింపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెల్లేరు జిల్లా నేలటూరులో సెంబ్‌కార్ప్‌ ఇండియా సంస్థకు 5.04 ఎకరాల భూమి, జమ్మలమడుగులోని దిగువపట్నంలో ఓబెరాయ్‌ విల్లాస్‌కు 50 ఎకరాలు కేటాయింపు, అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్‌ జాబ్‌, పోలవరం, అమరావతి ప్రాంతాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి మెగ్లాన్‌, గ్రీన్‌పార్క్స్‌ హోటల్స్‌కు ప్రోత్సాహకాలకు ఒకే చెప్పింది.

Next Story