అమరావతి: గెస్టు లెక్చరర్లకు గుడ్న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. వీరి సర్వీసును 2025 - 2026 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వీరి సేవలను నిలిపివేశారు. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్లు తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ హాల్టికెట్లను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. హాల్టికెట్లను https://polycetap.nic.inలో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 30వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.