15న‌ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం

సీఎం వైఎస్‌ జగన్ 15వ తేదీన‌ పల్నాడు జిల్లా మాచర్ల పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat
Published on : 13 Nov 2023 8:41 PM IST

15న‌ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం

సీఎం వైఎస్‌ జగన్ 15వ తేదీన‌ పల్నాడు జిల్లా మాచర్ల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. 15వ తేదీ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story