ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..90 రోజుల్లో అమలుకు సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు.

By -  Knakam Karthik
Published on : 6 March 2026 2:20 PM IST

#AndhraPradesh, Social Media Ban, Cm Chandrababu, ChildSafety, AP Assembly

ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..90 రోజుల్లో అమలుకు సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా ఈ నిషేధానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతేకాకుండా, ఈ వయోపరిమితిని 16 ఏళ్ల వరకు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారు సోషల్ మీడియా వ్యసనానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story