రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌..శాఖల వారీగా కేటాయింపులు ఇవే

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

By Knakam Karthik  Published on  28 Feb 2025 11:24 AM IST
Andrapradesh, Ap Budget, Assembly Sessions, Cm Chandrababu, Minister Payyavula Keshav

రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌..శాఖల వారీగా కేటాయింపులు ఇవే

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని చెప్పారు. అప్పులు తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేనంతగా పరిస్థితిని దిగజార్చారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని మండిపడ్డారు. వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024లో అపూర్వమైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ఆ సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు ఆయననకు ఆయనే సాటి అని కొనియాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసి ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థతికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూపొందించామని అన్నారు. రెవన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు అని తెలిపారు. అదేవిధంగా మూలధనం అంచనా రూ.40,635 కోట్లు అని సభలో వివరించారు.

శాఖల వారీగా కేటాయింపులు..

* అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు

* పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు

* రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.4,220 కోట్లు

* ఓడరేవులు, ఎయిర్‌పోర్టులకు రూ.605 కోట్లు

* ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు

* RTGS‌కు రూ.101 కోట్లు

* ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలకు రూ.300 కోట్లు

* వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు

* పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు

* బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు

* వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,265 కోట్లు

* SC, ST, BC స్కాలర్‌షిప్‌లకు రూ.3,377 కోట్లు

* స్వచ్ఛ ఆంధ్రా స్కీమ్‌కు రూ.820 కోట్లు

* పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,848 కోట్లు

* జల వనరుల శాఖకు రూ.18,020 కోట్లు

* పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు

* సాఘిక సంక్షేమ శాఖకు రూ.10,909 కోట్లు

* ఆర్థికంగా వెనుబడిన వారి సంక్షేమానికి రూ.10,619 కోట్లు

* NTR భరోసా పెన్షన్లకు రూ.27,518 కోట్లు

* ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు

* మనబడి పథకానికి రూ.3,486 కోట్లు

* తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు

* బాల సంజీవనీ పథకానికి రూ.1,163 కోట్లు

* చేనేత, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యత్ రూ,450 కోట్లు

* ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ రూ.400 కోట్లు

* అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు

* ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు

* సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు

* జలజీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు

* రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు

Next Story