ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 1,35,826 మంది, ద్వితీయ సంవత్సరంలో 97, 963 మంది పరీక్షలు రాశారు. కాగా ఈ ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా పొందవచ్చు అని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది.