Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 April 2024 11:14 AM GMT
andhra pradesh, tdp, janasena, bjp, manifesto,

Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో  

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ఈసారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు. ప్రధానంగా మేనిఫెస్టోలో పెన్షన్లు, మహిలలకు పథకాలపై ఫోకస్ పెట్టారు.

* మెగా డీఎస్సీపై మొదటి సంతకం

* సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

* ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

* మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

* దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

* బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

* 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

* యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

* నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

* తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

* రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

* వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

* పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

* ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

* ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

* భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

* చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

* పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

* ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం

* ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

* ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

* చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

* బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

* ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

* కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

* ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

* ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

* దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

* గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

* న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

* లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు

* రాజధానిగా అమరావతి కొనసాగింపు

* ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

* అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

* అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు

* విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం

* ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

* రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా

Next Story