అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..జగన్కు మంత్రి లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత జగన్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విసిరారు.
By Knakam Karthik
అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..జగన్కు మంత్రి లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత జగన్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విసిరారు. ఉరసా కంపెనీకి ఎకరం 99 పైసలకు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసింది. ఉరసా సంస్థకు 99పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే, రాజీనామా కు నేను సిద్ధం. టీసీఎస్కు 99 పైసలకు ఇచ్చాం, ఉరసాకు మార్కెట్ ధరకే భూములిచ్చాం. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేము. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేస్తోంది. మద్యం కుంభకోణం లో జగన్ వైఖరి దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది. రాష్ట్రానికి ఇక పరిశ్రమలు వస్తాయే కానీ ఒక్కటీ బయటకు పోదు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవటానికి ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు..అని మంత్రి లోకేశ్ విమర్శించారు.
పార్టీలో పదవులపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగించిన చేస్తా. పార్టీ కోసం కష్టపడిన అందరికి పదవులు వస్తాయి. నేను విద్యాశాఖ మంత్రి అయ్యాక ఏపీలో ఏ ఒక్క పాఠశాల మూసివేయలేదు. పదవులు రాలేదు అని నేతలు అలగడం మానేయాలి. సరైన సమయంలో పదవులు వస్తాయి. నేతలు అలగడం మాని పార్టీ కోసం కష్టపడి పని చేయాలి. వైసీపీ నేతలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడాలి..అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇక తదుపరి సీఎంగా మీరేగా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ స్పందిస్తూ..ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు. ఆయన ఇంకా యువ నాయకుడే. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వo ఇంకా చాలా అవసరం. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయి. వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళ్తే పొగాకు రైతులు సమస్యలు తెలిశాయి. వెంటనే అధికార యంత్రాంగాన్ని, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశాం. పార్టీకి ఎప్పుడూ నిరంతరం ఫీడ్ బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ. మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకూ వర్కింగ్ గ్రూప్ ఫార్ములా అమలు చేయాలనుకుంటున్నాం. క్షేత్ర స్థాయి వాస్తవాలు కోసం ఇది ఎంతో అవసరం. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతర చర్చ జరగాలి.
దేశంలో ఎక్కడా లేని విధంగా 9వేల పై చిలుకు పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ విధానo తీసుకొస్తున్నాం. ప్రధాని సమావేశంలో ఎన్నో సలహాలు, సూచనలు పరస్పరం పంచుకున్నాం. నా లాంటి యువకుడితో దాదాపు 20ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వటం ఆయన గొప్పతనం. పార్టీ బలంగా ఉండాలి, సంస్థాగతoగా బాగుండాలి. ఫీల్డ్లో పని చేసిన వారికి పదవులు ఇవ్వటం వల్ల మహానాడుకు ఊపు వచ్చింది. కార్యకర్తల్లో కసి కనిపిస్తోంది..అని మంత్రి లోకేశ్ తెలిపారు.