ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు.!

Alert to passengers.. South Eastern Central Railway has canceled many trains. ఆధునికీకరణ పనుల కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

By అంజి  Published on  5 Sep 2022 3:27 AM GMT
ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు.!

ఆధునికీకరణ పనుల కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనుంది. లఖోలి-రాయపూర్‌ మధ్య రెండో లైన్‌ పనులు, నయా రాయపూర్‌ స్టేషన్‌, యార్డులో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లీంచారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని సీనియర్‌ డీసీఎం కోరారు.

ఈనెల 11న విశాఖ-కోర్బా(18518), 12న కోర్బా-విశాఖ(18517), 6 నుంచి 12 వరకు విశాఖ-దుర్గ్‌(18530), 7 నుంచి 13 వరకు దుర్గ్‌-విశాఖ(18529) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు విశాఖ-రాయపూర్‌(08528), 7 నుంచి 13 వరకు రాయపూర్‌-విశాఖ(08527) రైళ్లను మహాసముండ-రాయపూర్‌-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేశారు.

ఈ నెల 8, 11 తేదీల్లో తిరుపతి-బిలాస్‌పూర్‌(17482), 10, 13 తేదీల్లో బిలాస్‌పూర్‌-తిరుపతి(17481), ఈ నెల 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో పూరీ-అహ్మదాబాద్‌(12843), 8, 10, 11, 12, 15 తేదీల్లో అహ్మదాబాద్‌-పూరీ(12844) రైళ్లను టిట్లాఘర్‌, సంబల్‌పూర్‌, జార్సుగూడ మీదుగా దారి మళ్లించారు.

ఈ నెల 12న విశాఖ- కోర్బా (18518) ఎక్స్‌ప్రెస్‌ 5 గంటలు.., 8, 15 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్‌(12897) సమతా ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు.., 12న హజ్రత్‌ నిజాముద్దీన్‌-విశాఖ(12808) సమతా ఎక్స్‌ప్రెస్‌ 5 గంటలు, 15న తిరుపతి-బిలాస్‌పూర్‌(17482) 4 గంటలు, విశాఖ-భగత్‌ కీ- కోఠి (18573) 5 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయి.

Next Story