హైకోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట

ఏపీ హైకోర్టులో న‌టుడు అల్లు అర్జున్‌కి ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు న‌మోదు చేశారు.

By Medi Samrat  Published on  25 Oct 2024 11:40 AM GMT
హైకోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట

ఏపీ హైకోర్టులో న‌టుడు అల్లు అర్జున్‌కి ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రాగా.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మ‌ద్ధ‌తు తెలిపేందుకు ఆయన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అక్క‌డ అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా గుమిగూడారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు.

Next Story