ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. త‌గ్గిన మ‌ర‌ణాలు

8766 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 93,511 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  9 Jun 2021 1:16 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. త‌గ్గిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 93,511 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 8,766 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. నిన్న 12,292 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,64,082కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు చొప్పున మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11696కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,00,39,764 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story