ఏపీలో 14వేలు దాటిన కరోనా మరణాలు
864 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 పరీక్షలు
By Medi Samrat Published on 13 Sep 2021 11:32 AM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 పరీక్షలు నిర్వహించగా.. 864 కేసులు నిర్ధారణ అయినట్లు సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849కి చేరింది. నిన్న కరోనా వల్ల 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,010కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,02,187కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,63,641 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 13/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,27,954 పాజిటివ్ కేసు లకు గాను
*19,99,292 మంది డిశ్చార్జ్ కాగా
*14,010 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,652#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/V1oiODUwue