ఏపీ క‌రోనా బులిటెన్‌.. వంద‌కు దిగువ‌న కేసులు న‌మోదు..

71 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  28 Feb 2022 1:37 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. వంద‌కు దిగువ‌న కేసులు న‌మోదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,969 పరీక్షలు నిర్వహించగా.. 71 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,812కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఒక్క‌రోజే ఒక‌రు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,727గా చేరింది. 24 గంటల వ్యవధిలో 595 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,00,760కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,325 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,31,05,610 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story