ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

671 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,523 పరీక్షలు నిర్వహించగా

By Medi Samrat
Published on : 5 Oct 2021 5:20 PM IST

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,523 పరీక్షలు నిర్వహించగా.. 671 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,53,863కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ప‌ద‌కొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,219కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,272 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,30,503కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,85,17,990 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story