ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు
6617 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,01,544
By Medi Samrat Published on
16 Jun 2021 11:19 AM GMT

ఏపీలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,01,544 శాంపిళ్లను పరీక్షించగా.. 6,617 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,26,751కి చేరింది. నిన్న 10,228 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,43,176కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది, గుంటూరు లో తొమ్మిది, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, విశాఖపట్నం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు చొప్పున మొత్తం 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,109కి చేరింది. ఇక రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,07,36,435 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story