ఏపీ కరోనా బులిటెన్.. భారీగా తగ్గిన కేసులు
618 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
By Medi Samrat Published on 27 Sep 2021 11:17 AM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,069 పరీక్షలు నిర్వహించగా.. 618 కేసులు నిర్ధారణ అయినట్లు సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459కి చేరింది. నిన్న కరోనా వల్ల ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,142కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,178 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,20,835కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,482 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,81,32,713 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 27/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,44,564 పాజిటివ్ కేసు లకు గాను
*20,17,940 మంది డిశ్చార్జ్ కాగా
*14,142 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,482#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/USdmoZ4ej3