ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

6151 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,02,712

By Medi Samrat  Published on  17 Jun 2021 11:44 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,02,712 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 6,151 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,32,902కి చేరింది. నిన్న 7,728 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,50,904కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూ ల్ లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు చొప్పున మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,167కి చేరింది. ఇక రాష్ట్రంలో 69,831 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story