ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

547 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,339

By Medi Samrat
Published on : 6 Jan 2022 7:47 PM IST

ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,339 పరీక్షలు నిర్వహించగా.. 547 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,78,923కి చేరింది. క‌రోనా వ‌ల్ల విశాఖ‌ప‌ట్నంలో ఒక‌రు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,500గా ఉంది. 24 గంటల వ్యవధిలో 128 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,62,157కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,14,92,070 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story