ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

54 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది రోజులుగా వంద లోపే పాజిటివ్

By Medi Samrat
Published on : 17 March 2022 11:49 AM

ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది రోజులుగా వంద లోపే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,594 పరీక్షలు నిర్వహించగా.. 54 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,066కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,730 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 57 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,829కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 507 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,33,02,909 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.







Next Story