ఏపీలో పెరిగిన కరోనా మరణాలు
503 New Corona Cases Reported in AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32,846
By Medi Samrat Published on 12 Oct 2021 3:06 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32,846 పరీక్షలు నిర్వహించగా.. 503 కేసులు నిర్ధారణ అయినట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58,065కి చేరింది. నిన్న కరోనా వల్ల 12మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,268కి చేరింది. 24 గంటల వ్యవధిలో 817 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,36,865కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,932 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,00,809 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 12/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 12, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,55,170 పాజిటివ్ కేసు లకు గాను
*20,33,970 మంది డిశ్చార్జ్ కాగా
*14,268 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,932#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/CdOg4xkZji