ఏపీ కరోనా బులిటెన్ విడుదల
500 Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 500 పాజిటివ్ కేసులు
By Medi Samrat Published on
15 Dec 2020 12:53 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,064కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కు చేరింది. తాజాగా 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,660 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,09,37,377 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 88, గుంటూరులో 55, కృష్ణలో 77 కేసులు, పశ్చిమగోదావరిలో 63 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
Next Story