ఏపీలో పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

493 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,820 పరీక్షలు నిర్వహించగా

By Medi Samrat  Published on  21 Oct 2021 1:42 PM GMT
ఏపీలో పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,820 పరీక్షలు నిర్వహించగా.. 493 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,303కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,327కి చేరింది. 24 గంటల వ్యవధిలో 552 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,42,476కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,500 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,42,162 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story