ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

4549 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 87,756 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  14 Jun 2021 11:54 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 87,756 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,549 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,14,393కి చేరింది. నిన్న 10,114 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,22,381కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశంలో ఎనిమిది, పశ్చిమ గోదావరి లోఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు చొప్పున మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,999కి చేరింది. ఇక రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story