ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన కేసులు

4,348 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

By అంజి  Published on  13 Jan 2022 12:30 PM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే ఇవాళ కరోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,884 పరీక్షలు నిర్వహించగా..4,348 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,92,227కి చేరింది. కోవిడ్ వల్ల కృ ష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.

రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,507గా ఉంది. 24 గంటల వ్యవధిలో 261 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,63,516కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లో 3,17,56,521 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story