ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

4250 Corona New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

By Medi Samrat  Published on  27 Jun 2021 10:58 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 95,327 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,250 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కి చేరింది. నిన్న 5,570 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,22,500కి పెరిగింది.

కోవిడ్ వల్ల కృష్ణ లో ఎనిమిది, చిత్తూర్ లో ఆరుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్క రు, విజయనగరం లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,599కి చేరింది. ఇక రాష్ట్రంలో 44,773 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,17,32,933 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story