ఏపీ క‌రోనా బులిటెన్.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

3797 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన

By Medi Samrat  Published on  30 Jun 2021 12:31 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

నిన్న‌టితో పోలిస్తే నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 97,696 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,797 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513కి చేరింది. నిన్న 5,498 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,38,469కి పెరిగింది.

కోవిడ్ వల్ల ప్రకాశంలో ఎనిమిది, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, నెల్లూరు లో ఒక్క రు, విశాఖపట్నం లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,706కి చేరింది. ఇక రాష్ట్రంలో 38,338 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,19,93,618 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story