ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

2974 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  18 July 2021 11:23 AM GMT
ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,05,024 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,974 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,40,096కి చేరింది. నిన్న 3,290 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,02,256కి పెరిగింది.

కోవిడ్ వల్ల ప్రకాశం లో ఐదుగురు, చిత్తూర్ లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున 17 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,132కి చేరింది. ఇక రాష్ట్రంలో 24,708 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,35,93,055 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story