ఏపీ కరోనా బులిటెన్.. పెరిగిన కేసులు, మరణాలు
2672 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి.
By Medi Samrat Published on
17 July 2021 12:27 PM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 91,594 శాంపిళ్లను పరీక్షించగా.. 2,672 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122కి చేరింది. నిన్న 2,467 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,115కి చేరింది. ఇక రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,34,88,031 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story