ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

2498 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  20 July 2021 11:58 AM GMT
ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 88,149 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,498 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222కి చేరింది. నిన్న 2,201 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, ప్రకాశం లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణ లో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు చొప్పున 24 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,178కి చేరింది. ఇక రాష్ట్రంలో 23,843 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,37,52,356 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story