ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

244 New Covid-19 cases Reported in AP.నిన్న‌టితో పోలిస్తే నేడు రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గడిచిన 24

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 12:24 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

నిన్న‌టితో పోలిస్తే నేడు రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,803 పరీక్షలు నిర్వహించగా.. 244 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,711కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న చిత్తూరు మ‌రియు కృష్ణా జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,716గా చేరింది. 24 గంటల వ్యవధిలో 662 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,96,430కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,565 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,30,10,692 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story