ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో ఇద్ద‌రు మృత్యువాత‌

220 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  24 Feb 2022 1:24 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో ఇద్ద‌రు మృత్యువాత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17,735 పరీక్షలు నిర్వహించగా.. 220 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,184కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న చిత్తూరు మ‌రియు కృష్ణా జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,720గా చేరింది. 24 గంటల వ్యవధిలో 472 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,97,537కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,927 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,30,47,859 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story