ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

2100 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది.

By Medi Samrat  Published on  5 July 2021 12:02 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,731 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,100 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. నిన్న 3,435 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,58,189కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్క రు, విశాఖపట్నం లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,870కి చేరింది. ఇక రాష్ట్రంలో 33,964 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,24,35,809 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story