ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన మ‌ర‌ణాలు

2068 New Corona Case reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 80,641 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  30 July 2021 12:15 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 80,641 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,068 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,117కి చేరింది. నిన్న 2,127 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,29,565కి పెరిగింది.

కోవిడ్ వల్ల ప్రకాశం లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరు లో ఇద్దరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం , విశాఖపట్నం, విజయనగరంలలో ఒక్కొక్క‌రు చొప్పున 22 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,354కి చేరింది. ఇక రాష్ట్రంలో 21,198 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,44,84,051 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story