ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. భారీగా కేసులు, మ‌ర‌ణాలు

20065 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,01,571 క‌రోనా నిర్థార‌ణ

By Medi Samrat  Published on  8 May 2021 2:01 PM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. భారీగా కేసులు, మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,01,571 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 20,065 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12,65,439కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా విశాఖ‌ప‌ట్నంలో 2,525 మంది, విజ‌య‌న‌గ‌రంలో అత్య‌ల్పంగా 650 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో పద్నాలుగు మంది, విశాఖపట్నంలో పన్నెండు మంది, అనంతపూర్ లో పది మంది, గుంటూరు లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, చిత్తూర్ లో ఆరుగురు, కడప లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు చొప్పున మొత్తం 96 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,615కి చేరింది. నిన్న 19,272 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 10,69,432కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,87,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,72,62,441 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.




Next Story