ఏపీలో 10వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

19,981 Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 90,609

By Medi Samrat  Published on  22 May 2021 11:53 AM GMT
ఏపీలో 10వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 90,609 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 19,981 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. నిన్న 18,336 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,41,355కి పెరిగింది.

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో పదిహేను మంది, చిత్తూర్ లో పద్నాలుగు మంది, తూర్పు గోదావరి లో పదకొండు, విశాఖపట్నం లో పదకొండు, గుంటూరు లో పది, అనంతపూర్ లో తొమ్మిది, కృష్ణ లో తొమ్మిది, శ్రీకాకుళంలో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు చొప్పున మొత్తం 118 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,022కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,10,683 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,85,25,758 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story