ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

19412 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 98,214 క‌రోనా

By Medi Samrat  Published on  1 May 2021 1:47 PM GMT
ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 98,214 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 19,412 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చిత్తూరులో 2,768 మంది, విజ‌య‌న‌గ‌రంలో అత్య‌ల్పంగా 606 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

ఇక నిన్న ఒక్క‌రోజే కోవిడ్ వల్ల విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఏడుగురు, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, ప్రకాశం లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 61మంది మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,053కి చేరింది. నిన్న 11,579 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 9,82,297కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,30,752 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,64,88,574 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.




Next Story