ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన మరణాలు
1746 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,341 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on 13 Aug 2021 11:35 AM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,341 శాంపిళ్లను పరీక్షించగా.. 1,746 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656కి చేరింది. నిన్న 1,648 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,58,275కి పెరిగింది.
#COVIDUpdates: 13/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,87,761 పాజిటివ్ కేసు లకు గాను
*19,55,380 మంది డిశ్చార్జ్ కాగా
*13,615 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,766#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oieX48VjCG
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, గుంటూరు లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,615కి చేరింది. ఇక రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,55,26,861 సాంపిల్స్ ని పరీక్షించారు.