ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు
17354 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 86,494 కరోనా
By Medi Samrat Published on 30 April 2021 1:51 PM GMT
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 86,494 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 17,354 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,01,690 కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 2,764 మంది, అత్యల్పంగా 661 మంది కరోనా బారిన పడ్డారు.
#COVIDUpdates: 30/04/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 30, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,98,795 పాజిటివ్ కేసు లకు గాను
*9,67,823 మంది డిశ్చార్జ్ కాగా
*7,992 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,22,980#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/E5ix7ExNxq
ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 64 మంది మృతిచెందగా.. ఈ మహమ్మారి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,992కి చేరింది. నిన్న 8,468 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 9,70,718కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,63,90,360 సాంఫిల్స్ను పరిక్షించారు.