ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
1557 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64,550 పరీక్షలు నిర్వహించగా.. 1,557
By Medi Samrat Published on 29 Aug 2021 11:57 AM GMT
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64,550 పరీక్షలు నిర్వహించగా.. 1,557 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,12,123 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,213 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,83,119కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,65,35,822 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 29/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 29, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,09,228 పాజిటివ్ కేసు లకు గాను
*19,80,224 మంది డిశ్చార్జ్ కాగా
*13,825 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,179#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gU8esNmNEZ