ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

1539 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,590 పరీక్షలు నిర్వహించగా.. 1,539

By Medi Samrat
Published on : 26 Aug 2021 4:24 PM IST

ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,590 పరీక్షలు నిర్వహించగా.. 1,539 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,07,730 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,778కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,140 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,79,504కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,448 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,63,37,946 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story