ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. 24 గంట‌ల్లో 12 మంది మృతి

13819 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. నిన్న‌టితో పోల్చితే

By Medi Samrat  Published on  25 Jan 2022 12:37 PM GMT
ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. 24 గంట‌ల్లో 12 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. నిన్న‌టితో పోల్చితే ఈ రోజు రాష్ట్రంలో కేసులు సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. పండ‌గ‌కు ముందు రాష్ట్రంలో మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కేసులు పెర‌గ‌డంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46,2929 పరీక్షలు నిర్వహించగా.. 13,819 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,08,955కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ప‌న్నెండు మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రు, కర్నూలు జిల్లాలో ఇద్ద‌రు, నెల్లూరు జిల్లాలో ఇద్ద‌రు, విశాఖపట్నం జిల్లాలో ఇద్ద‌రు, ప్ర‌కాశం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,561గా ఉంది. 24 గంటల వ్యవధిలో 5,716 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,92,998కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,22,34,226 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story