ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు
1179 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,737 పరీక్షలు నిర్వహించగా
By Medi Samrat Published on
21 Sep 2021 12:01 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,737 పరీక్షలు నిర్వహించగా.. 1,179 కేసులు నిర్ధారణ అయినట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,40,708కి చేరింది. నిన్న కరోనా వల్ల పదకొండు మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,089కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,651 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,12,714కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,78,13,498 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story