ఏపీ కరోనా బులిటెన్.. తగ్గిన కేసులు.. భారీగా మరణాలు
11303 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్
By Medi Samrat Published on 1 Jun 2021 11:44 AM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 93,704 శాంపిళ్లను పరీక్షించగా.. 11,303 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,04,388కి చేరింది. నిన్న 18,257 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,46,617కి పెరిగింది.
కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో ఇరవై మంది, చిత్తూర్ లో పద్నాలుగు మంది, అనంతపూర్ లో తొమ్మిది, గుంటూరు లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, విశాఖపట్నం లో ఏడుగురు, కృష్ణ లో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప లో ఐదుగురు, నెల్లూరు లో నలుగురు, ప్రకాశం లో నలుగురు చొప్పున మొత్తం 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,034కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,46,737 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,93,50,008 సాంపిల్స్ ని పరీక్షించారు.