ఏపీ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెడుతున్న మ‌ర‌ణాలు

10413 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,311 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  4 Jun 2021 11:18 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెడుతున్న మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,311 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 10,413 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,38,990కి చేరింది. నిన్న 15,469 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,93,921కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, పశ్చిమ గోదావరి లో పదకొండు మంది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పుగోదావరి లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కృష్ణ లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, నెల్లూరు లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు చొప్పున మొత్తం 83 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,296కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,33,773 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,96,19,590 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story