ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ వంద‌కు పైగా కేసులు న‌మోదు

101 New Corona Cases Reported In India. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  2 March 2022 12:28 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ వంద‌కు పైగా కేసులు న‌మోదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,008 పరీక్షలు నిర్వహించగా.. 101 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,054కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఎటువంటి మ‌ర‌ణ‌మూ సంభ‌వించ‌లేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,729. 24 గంటల వ్యవధిలో 458 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,01,668కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,657 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,31,26,189 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story