హైదరాబాద్ : నగరానికి చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాళ్లోకెళితే.. బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుని ఏసీబీకి అడ్డంగా దొరికి పోయింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. గతంలోనూ ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి లక్ష్మీ రూ.50 వేలు లంచం తీసుకున్నట్టు సమాచారం.