హైదరాబాద్ : కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ను సిట్ పోలీసులు హైదరాబాద్ తరలించారు. అబ్దుల్ కరీం టుండా ప్రస్తుతం గజియాబాద్ జైల్లో ఉన్నాడు. హైదరాబాదులోని పలు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న టుండా ను ఏడు సంవత్సరాల క్రితం నేపాల్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. టుండా ను సిట్ పోలీసులు పిటీ వారంట్ కింద హైదరాబాద్ తీసుకు వచ్చారు. కాగా, అబ్దుల్ కరీం టుండా హైదరాబాద్ లోనే కాక.. దేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.