ఏపీలో కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 92 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 1:34 PM GMT
ఏపీలో కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 92 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 64,351 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,927 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,71,639కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో పదహారు మంది, అనంతపూర్‌లో పదకొండు మంది, కడపలో పది మంది, ప్రకాశంలో పది మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణలో నలుగురు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,460 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,78,247 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 89,932 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 494,

చిత్తూరులో 967,

ఈస్ట్‌ గోదావరిలో 1353,

గుంటూరులో 917,

కడపలో 521,

కృష్ణలో 322,

కర్నూలులో 781,

నెల్లూరులో 949,

ప్రకాశంలో 705,

శ్రీకాకుంలో 552,

విశాఖపట్నంలో 846,

విజయనగరంలో 667,

పశ్చిమ గోదావరిలో 853 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story